Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిసిటీ స్టంట్: అందుకే రంభపై వరకట్నం కేసు.. సోదరుడు

Webdunia
బుధవారం, 23 జులై 2014 (14:55 IST)
రంభపై వరకట్నం వేధింపు కేసు పబ్లిసిటీ కోసమేనని రంభ సోదరుడు శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటి రంభపై డౌరీ కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు 498 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు. అయితే రంభ సోదరుడు శ్రీనివాస్ మాత్రం పల్లవి ఆరోపణలను ఖండించారు. పల్లవి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశారు.
 
పల్లవి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందని కొట్టిపారేశారు. రంభ పరువు తీయాలనే పల్లవి ఇదంతా చేస్తుందని, ఆమె కుటుంబ సభ్యులే ఆమెతో ఇదంతా చేయిస్తున్నారని శ్రీనివాస్ చెప్పారు. రంభపై ఆరోపణలు చేస్తే సహించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments