Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ మళ్లీ సైన్ ఇన్ అయి ఔట్ చేసేశారు...

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (12:43 IST)
ట్విట్టర్ ను బాగా వాడుకోవడంలో రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. తన మైండులో ఏది వస్తే అది వెంటనే ట్విట్టర్ లోకి సైన్ ఇన్ అయి దానిని ఔట్ చేసేస్తుంటారు. అలాంటిదే మళ్లీ మరొకటి పేల్చారు. అదేంటయా అంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తుపాన్ బాధితులు... ముఖ్యంగా విశాఖపట్టణం వాసులు తాము త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. 
 
ఈ దీపావళికి పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. అసలు వాళ్లకు ఈ పరిస్థితి కల్పించింది ఆ దేవుడు కదా? మరి ఆ దేవుడు తెచ్చిన కష్టాలను తొలగించమని కోరుకుంటూ తిరిగి అదే దేవుడికి ప్రార్థనలు చేయడం ఏమిటంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. 
 
అంటే... దేవుడిని ప్రార్థించకూడదనేగా వర్మ ట్వీట్ సారాంశం. వర్మ దెబ్బకు దేవుళ్లు కూడా భయపడిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వర్మకు మండిందంటే... విశాఖకు నష్టాన్ని కల్గించిన హుధుద్ తుఫానుపై చిత్రాన్ని లాగించినా లాగించేస్తారని అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments