Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచ్చీందర్ శర్మను లాగి రెండు పీకులు పీకిన రాఖీ సావంత్ ఫ్రెండ్!

Webdunia
శుక్రవారం, 12 డిశెంబరు 2014 (14:17 IST)
రాఖీ సావంత్ స్నేహితురాలు మనీషా కుమారి చిత్ర దర్శకుడు సచ్చీందర్ శర్మపై చేజేసుకుంది. తన స్నేహితురాలు రాఖీ సావంత్ నృత్యం చేసిన గీతాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ, ‘ముంబై కెన్ డాన్స్ సాలా' సినీ డైరక్టర్‌ సచ్చీందర్ శర్మను వేదికపై వీర బాదుడు బాదింది. 
 
గురువారం రాత్రి ఆడియో వేడుక జరుగుతుండగా స్టేజీపైకి దూసుకొచ్చి, దర్శకుడితో వాగ్వివాదానికి దిగిన మనీషా మాటలతో ఆగకుండా దర్శకుడిని లాగి రెండు పీకులు పీకారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సినిమా అవకాశం ఇవ్వాలని అడిగితే లైంగిక పరమైన కోరికలు తీర్చమని ఆయన కోరాడని ఆరోపించారు. 
 
అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మనీష ఈ మేరకు దర్శకుడిపై ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే స్పందించిన దర్శకుడి భార్య మధు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, చీప్ పబ్లిసిటీ కోసమే రాఖీ సావంత్, ఆమె ఫ్రెండ్ మనీషా ఈ డ్రామాకు తెరతీసారని, అన్యాయంగా తన భర్తపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు