నందు, నికిత నారాయన్ జంటగా కత్తి మహేష్ దర్శకత్వంలో క్లాప్ బోర్డ్ స్టుడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్, రిచెజ్జ మీడియా ఎంటర్ టైన్మెంట్స్, పింక్ పాక్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'పెసరట్టు'. ఈ సినిమా హైదరాబాద్ లోని గండిపేటలో ప్రారంభం అయింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శక నిర్మాత స్టీవన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా టాలీవుడ్ లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మాణం జరుపుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ.. ఫ్లో-కాం టెక్నాలజీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో, హీరోయిన్ మినహా నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారం రోజులు వారందరికీ వర్క షాప్ నిర్వహించారు. ఈ రోజు నుంచి సింగిల్ షెడ్యూలులో పూర్తి చేసి.. అక్టోబరులో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.