Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటకు పద్మ అవార్డు... మరి కైకాలకు ఎప్పుడిస్తారు...?

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (19:13 IST)
పద్మ అవార్డులు.. అనేవి కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వుంటే ఆ ప్రభుత్వం అనుకూలురుకు ఇవ్వడం పరిపాటి. తాజాగా పద్మ అవార్డులో పెద్దగా వివాదాస్పద అంశాలు లేకపోయినా.. సినిమా రంగంలో మాత్రం... కోట శ్రీనివాసరావుకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తను గతంలో బిజెపి ఎంఎల్‌ఎగా ఎన్నికై, మరలా ఓడిపోయారు. అయినా బిజెపి మూలాలు ఆయనకు ఎక్కడా పోలేదు. 
 
ప్రస్తుతం కోట శ్రీనివాసరావు కంటే.. కైకాల సత్యనారాయణ ఉద్దండుడు. కైకాలనే చాలాసార్లు కలిసినప్పుడు మీకు కేంద్రం నుంచి సరైన గుర్తింపు రాలేదని కోట అంటుండేవారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో ఆలోచనలను రేపింది.
 
గతంలో పరిశీలిస్తే... విశ్వనట చక్రవర్తిగా పిలువబడే ఎస్‌వి రంగారావుకు పలు సంస్థలు ప్రభుత్వం గౌరవించింది. నర్తనశాలలో ఆయన చేసిన కీచక పాత్రకు జకార్తా ఫిలిం ఫెస్టివల్‌ ఎంపిక చేసింది. తెలుగు, తమిళ భాషల్లో చేసినా... కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సముచితంగా గౌరవించలేదు. ఇప్పుడు అదే బాటలో సత్యనారాయణ వున్నాడని కామెంట్లు విన్పిస్తున్నాయి. కైకాల సత్యనారాయణ అలనాటి తరంతోనూ, ఈనాటి తరంతోనూ వేషాలు వేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 
 
గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2011లో రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మ అవార్డు మాత్రం ఆయనకు దక్కలేదు. ఒక సినీయర్‌ నటుడిగా, ప్రస్తుతం చరమాంకంలో వున్న సత్యనారాయణను తగు విధంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా వుందని సినీ పండితులు పేర్కొంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments