ఆర్.ఎ.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నటి రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ మల్లి'. బి.ఎస్.ప్రశాంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే కూడా రమ్యశ్రీ అందించారు. స్త్రీలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కథగా ఎంచుకుని రమ్యశ్రీ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.
సునీల్ కశ్యప్-కృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ ఫిబ్రవరి 27న హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్స్లో జరుగనుంది. ప్రముఖ గాయకులు జేసుదాసు, చిత్ర ఈ చిత్ర గీతాలను ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదల కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు, మినిష్టర్ పీతల సుజాత, రావి కిషోర్ బాబు, తెలంగాణా మహిళా స్టేట్ ప్రెసిడెంట్ శోభారాణి హాజరు కానున్నారు.