Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించని ప్రభుదేవ రాయబారం... తగ్గని నయన ఆగ్రహం..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (13:15 IST)
వెండితెరపై అగ్రతారగా వెలుగుతున్న అందాల తార నయనతార. ఆమె సినీ కెరీర్ పరంగా వెలిగిపోతున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. రెండుసార్లు ఆమె ప్రేమలో ఫెయిలైంది. మొదట శింబుతో ఆమె ప్రేమాయణం బెడిసికొట్టగా, అనంతరం ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్ళిన ప్రేమాయణం బ్రేకప్ అయింది. 
 
దీంతో ఆమె ప్రభుదేవాపై ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అతనిని జీవితంలో క్షమించేది లేదని సన్నిహితులతో అంటుంటుందట. ఈ నేపథ్యంలో ప్రభు ఆమెకు మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నయనను తనతో కలపాల్సిందిగా ప్రభు ఓ టాలీవుడ్ నిర్మాతను కోరాడనీ, ఆయన ఆమెను సంప్రదించగా నయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందనీ, మళ్లీ ఇటువంటి వాటి కోసం తన ముందుకు రావద్దని ఆ పెద్దమనిషి హెచ్చరించి పంపిందట.
 
జీవితంలో మళ్లీ అతనితో కలిసేది లేదని తెగేసి చెప్పిందట. ఇందులో నిజమెంతుందో కానీ, ఈ వార్త మాత్రం ఇప్పుడు బాగా ప్రచారంలో వుంది. మరో వైపు నయన తల్లిదండ్రులు ఆమెకు తగిన వరుడి కోసం గాలిస్తున్న సమాచారం. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments