Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైజ్ జీరో'లో నాగార్జున... అనుష్క రెకమెండ్‌తోనే..!

Webdunia
గురువారం, 14 మే 2015 (12:11 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార అనుష్కకు ఈ ఏడాది సొంతం కాబోతుంది. ఎందుకంటే ఆమె నటించిన రుద్రమదేవి, బాహుబలి వంటి చారిత్రాత్మక చిత్రాలతోపాటు 'సైజ్ జీరో' కూడా విడుదల కానుంది. ఇప్పటికే  బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న అనుష్క, ప్రస్తుతం 'సైజ్ జీరో'లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. 
 
ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో గెస్టుగా నాగార్జున కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున గెస్టుగా చేస్తాడా? అనే ఆశ్చర్యం సహజంగానే చాలామందికి కలుగుతుంది. అయితే అది సినిమాని మరింత ఆసక్తికరంగా ముందుకు నడిపించే పాత్ర అని తెలుస్తోంది.
 
అనుష్కతో పాటు ఆర్య నటిస్తోన్న ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర ఉందట. తెరపై కాసేపు మాత్రమే కనిపించే ఈ పాత్రను, మంచి క్రేజ్ ఇమేజ్ వున్న హీరోలతో చేయిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. దీంతో ఈ పాత్రకు నాగార్జునను తీసుకోవాలని అనుష్క రెకమెండ్ చేసిందట. అంతేకాకుండా ఈ చిత్రకు నాగార్జున తప్ప మరెవరూ సూట్ కారని, ఆయన అయితేనే చక్కగా నప్పుతారని అనుష్క అభిప్రాయపడింది.
 
అంతేకాదు, ఈ విషయాన్ని నాగ్‌తో చెప్పగా వెంటనే ఒప్పేసుకున్నారట. అంతేకాకుండా అనుష్క అడగడం కాదనడమా అంటూ అమ్మడుని ఎత్తేశాడని, దీంతో ఓ వైపు నాగార్జున గె‌స్ట్‌రోల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచుతుందని చెప్పుకుంటున్న అభిమానులకు అనుష్క, నాగార్జుల మధ్య అంత కెమిస్ట్రీ ఏంటా అని ఆలోచనలో పడ్డారట.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments