Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 3న దోచేయ్ ఆడియో.. సమ్మర్ స్పెషల్‌గా సినిమా రిలీజ్!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (19:26 IST)
యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతిసనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 'దోచేయ్' సినిమా ఆడియో ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ 'మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఈ చిత్రంలోని పాటలను రోజుకి ఒక్కొక్కటి చొప్పున రిలీజ్‌ చేయబోతున్నాం. అలాగే ఏప్రిల్‌ 2న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తున్నాం. ఏప్రిల్‌ 3న లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియోను రిలీజ్‌ చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్‌ 17న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా 'దోచేయ్' నిలుస్తుంది. అలాగే మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది." అని చెప్పారు. 
 
నాగచైతన్య సరసన కృతిసనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని మురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments