Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు లేరు... చచ్చిపోయారు : మోహన్‌ బాబు వ్యాఖ్య

Webdunia
శనివారం, 23 మే 2015 (20:25 IST)
సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బా సొమ్ముకాదు. అందరూ కలిసుంటేనే చక్కగా వుండగలం. గుట్టు, గోప్యం అందరికీ వుంటుంది. వీలైతే సాయం చేసి కలిసికట్టుగా వుందామని... మోహన్‌ బాబు అన్నారు. ఇటీవలే ఆయన కుమార్తె మంచు లక్ష్మీ విడుదల చేసిన 'దొంగాట' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆయన ఈవిధంగా స్పందించారు. 
 
ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు మీడియాపై పెట్టిన ఆంక్షలకు ఓ ఛానల్‌ ప్రతినిధి అడిగితే.. పైవిధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో నిజమైన నిర్మాతలు లేరు. చనిపోయారు. మంచి దర్శకులు కూడా వేళ్ళపై లెక్కించవచ్చు. ఇప్పుడున్న నిర్మాతలు ఫైనాన్షియర్ల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసేరకం  అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఇక లక్ష్మీగురించి మాట్లాడుతూ.. మొదట ఇండస్ట్రీలోకి వద్దన్నాను. కానీ విష్ణు ప్రోత్సాహంతో టీవీ షోలు చేసి పేరు తెచ్చుకుంది. ఆమెకొక బ్రాండ్‌ ఏర్పర్చుకుంది. ఇప్పుడు మంచి పేరు తెచ్చిపెట్టింది అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ... ఆరంభంలోనే సినిమాపై నమ్మకముంది. అదే నిజమయిందని విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments