Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మేము సైతం'' కమల్, బాలయ్య పాట-పవన్, మహేష్, వెంకీ స్కిట్!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (14:58 IST)
''మేము సైతం'' ప్రత్యేక సినీ కాన్సెప్ట్‌లకు వేదిక కానుంది. విశ్వరూపం హీరో కమలహాసన్ స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేయడం చాలా అరుదు. అలాంటి ముచ్చట 'మేము సైతం' కార్యక్రమంలో చోటుచేసుకోబోతోంది. 
 
ఏపీ తుపాను బాధితుల సహాయార్థం ఈ నెల 30న హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ఈవెంటుకి కమల్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే, నాటి కార్యక్రమంలో కేవలం ప్రేక్షకుడిలా కూర్చోకుండా, అందరితో బాటు తాను కూడా వినోద కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నిశ్చయించుకున్నట్టు తెలిసింది. 
 
ఈ క్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే మ్యూజిక్ కాన్సర్ట్‌లో కమల్ హాసన్ పాటలు పాడతారని తెలుస్తోంది. 
 
అంతేగాకుండా.., 'మేము సైతం' కార్యక్రమంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాట పాడనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆర్కెస్ట్రాతో కలసి బాలయ్య రెండు పాటలు పాడతారని తాజా సమాచారం. అవి తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలలోని సూపర్ హిట్ సాంగ్స్ అవ్వచ్చని తెలుస్తోంది.
 
ఇప్పటికే ఆయన రిహార్సల్స్ చేస్తున్నారు. ఇంకా పవన్, మహేష్ బాబు ఒక స్కిట్ ... 'పెళ్లికాని ప్రసాద్' పేరుతో వెంకీ ఒక స్కిట్ ప్రిపేర్ అవుతున్నారు. ఏమైనా, ప్రేక్షకులు ఎన్నడూ వీక్షించని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు మేముసైతం కార్యక్రమంలో చూడవచ్చునని సినీ పండితులు అంటున్నారు. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments