Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జా కేసులో మణిశర్మపై చెన్నైలో కేసు నమోదు!

Webdunia
ఆదివారం, 6 జులై 2014 (13:44 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై ఓ భూకబ్జా కేసు నమోదైంది. ఈ కేసులో చెన్నై ఆలందూరు కోర్టులో నేరవిభాగపు పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మణిశర్మకు స్థానిక నీలాంగరై సమీపంలోని కానాత్తురులో కొంత స్థలం ఉంది. ఈ స్థలానికి కంచె వేసే సమయంలో తనకు చెందిన 75 సెంట్ల భూమిని కూడా కలుపుకున్నట్లు కరుప్పన్‌ అనే వ్యక్తి మణిశర్మపై నీలాంగరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ కేసు విచారణ చేపట్టిన నేర విభాగపు పోలీసులు కంచెవేసిన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు పాల్పడినట్లు తేలడంతో, ఆలందూర్‌ కోర్టుకు నివేదించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మణిశర్మ ముందస్తు బెయిల్‌ పొంది ఉన్నారు. కాగా, నకిలీ పత్రాలతో దాదాపు 10 కోట్ల విలువ చేసే భూమిని మణిశర్మ కబ్జా చేసినట్లు ఆరోపణ. ఈ విషయమై ఇప్పటికే మణిశర్మ మేనేజర్‌ని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ కోసం మణిశర్మను త్వరలో పిలిపిస్తారని తెలుస్తోంది. 

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

Show comments