Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ షూటింగ్ స్పాట్ సమీపంలో గ్యాంగ్ వార్... కాల్పుల్లో ఒకరు మృతి

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (18:03 IST)
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ స్పాట్‌కు సమీపంలో గ్యాంగ్ వార్ జరిగింది. ముంబై ఫిల్మ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం ఫిల్మ్ సిటీలోని కాళియా మైదాన్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో సెక్యురిటీ కాంట్రాక్టర్ రాజు షిండే గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతానికి రెండు బైకులపై వచ్చిన దుండగులు రాజు‌పై అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. 
 
దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ రాజు షిండే పొట్టలో దిగబడింది. అనంతరం ఆ దుండగులు అక్కడికి నుంచి పరారైయ్యారు. దీన్ని గమనించిన సమీపస్తులు రాజును హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే దుండగులు ఒక బైకును సంఘటనా స్థలంలో వదిలేసి వెళ్లినట్టు తెలిపారు.
 
ఈ విషయం తెలుసుకుని అమితాబ్ చిత్ర యూనిట్ అంతా ఆందోళన చెందారట. తాము షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి 20 అడుగుల దూరంలో ఈ గ్యాంగ్ వార్ జరిగిందని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments