Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ ''ఆగడు'' పంచ్ డైలాగ్స్.. వివాదం కోసం పవన్‌పై సెటైర్లు!

Webdunia
శనివారం, 31 మే 2014 (15:51 IST)
ప్రిన్స్ మహేష్ బాబు తన నాన్న కృష్ణకు బర్త్‌డే కానుకగా 'ఆగడు' ట్రైలర్‌ని రీలీజ్ చేశాడు. తాజాగా విడుదలైన ఆగడు ఫస్ట్‌లుక్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహేష్ చెప్పే డైలాగ్స్ సూపర్భ్‌గా వున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లో ఓ డైలాగ్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేసినట్లుగా వుందనే టాక్ వస్తోంది. పవన్ 'అత్తారింటికి దారేది'లో సింహాం డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా మహేష్ ఆగడులో ''ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్....'' అంటూ ఓ డైలాగ్ ఉంది. దీనిని బట్టి చూస్తే కావాలనే పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేసినట్లు ఉందని కొందరు అంటున్నారు. ఒకవేళ ఈ విషయంలో రచ్చ జరిగితే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ప్లాన్ చేసారని, మీడియాలో వివాదాస్పదం కావాలనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఏదైతేనెం ఈ ట్రైలర్ 'ఆగడు' సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేసింది. దూకుడు వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌కి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా నదియా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments