Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కలిసిన హిట్ పెయిర్.. మరో హిట్‌కు రెడీ..!

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (15:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, క్రేజీ బ్యూటీ సమంతాలు జంటగా నటించిన 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి చిత్రాలు విజయం సాధించడంతో ఈ జంటగా హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే, ఆ తర్వాత మహేష్ 'నేనొక్కడినే'  సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా పోస్టర్‌పై సమంతా వివాదాస్పద వ్యాఖ్యలుచేసి మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. 

ఈ సంఘటనతో మహేష్ కూడా మనస్తాపం చెందాడు. అప్పటి నుంచి మహేష్, సమంతలు కలిసి నటించలేదు. దీంతో వారిద్దరు ఇక కలిసి నటించేందికాదుకదా, ‌కలిసి కనిపించరు కూడా అని కోలీవుడ్ అనుకుంది. ఈ స్థితిలో గత నెలలో జరిగిన మేము సైతం వేడుకలకు వారిద్దరిని ఆహ్వానించారు. అయితే వారు అందుకు ససేమిరా అనడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఒక ప్లాన్ చేశారు.
 
ఆ ప్లాన్ ప్రకారం 'మేము సైతం' వేడుకలో మహేష్, సమంతాను కలిసి చాట్ చేసే విధంగా చేయడంతో వారి మధ్య చోటు చేసుకున్న మౌనం వీడింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ జంట వెండితెరకు రానుంది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మించే చిత్రంలోనే. ఎలాగైతేనేమి త్రివిక్రమ్ శ్రీనివాస్ విడిపోయిన హిట్ పెయిర్‌ను కలిపి, మరో హిట్టు కొట్టేందుకు సిద్ధం చేస్తున్నారనమాట.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments