దీపావళి పండుగను కాజల్ అగర్వాల్ ధూమ్ ధామ్గా జరుపుకుంది. షూటింగ్ల నుంచి లీవ్స్ తీసుకున్న కాజల్ అగర్వాల్ తన సొంతిల్లున్న ముంబైలోనే వుండిపోయింది. తన సిస్టర్ నిషా, తాను చాలా హడావుడి చేశామని, భక్తి ప్రపత్తులతో లక్ష్మీదేవి పూజ చేశామని కాజల్ ట్విట్టర్లో వెల్లడించింది.
ఈ దీపావళి రోజున ఉదయ లక్ష్మీదేవి పూజ.. మధ్యాహ్నం పిండివంటలతో అందరం కలసి లంచ్ చేశామనీ చెప్పింది. ఇక సాయంత్రం క్రేకర్స్ బాగా కాల్చామని అంటోంది. తమ వీధులన్నీ దీపాల వెలుగులతోనూ... బాణసంచా పేలుళ్లతోనూ కొత్త కళ సంతరించుకున్నాయని చెప్పింది.
అలాగే, సాయంత్రం స్టాక్ ఎక్చేంజిలో జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ 'మూరత్'ని తాను గంట కొట్టి ప్రారంభించడం ఓ మధురమైన అనుభూతని కాజల్ అంటోంది.