Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన 'ఓకే కన్మణి'... ప్రేయసి రాలేదని ప్రియుడు ఆత్మహత్య..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:56 IST)
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహ్మాన్‌ల కాంబినేషన్‌లో విడుదలై, హిట్టు కొట్టిన తాజా చిత్రం 'ఓకే కన్మణి'. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ 'ఓకే బంగారం' పేరుతో విడుదల చేశారు. తమిళనాడులో ఈ క్లాసీ లవ్ స్టొరీ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. 
 
బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కుమ్మరిస్తున్న ఈ చిత్రం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కోయంబత్తురులో ఆదివారం సాయంత్రం ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకొని అందరిని షాక్‌కు గురిచేసింది. కోయంబత్తూరుకి చెందిన జే.జైశంకర్ (29) తన ప్రియురాలిని 'ఓకే కన్మణి' సినిమాకి రమ్మనిపిలిచాడు. 
 
అయితే ఆమె రాకపోవడంతో జైశంకర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రాకపోతే కూడా ఇలా ప్రాణాలు తీసుకోవడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ సినిమాని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments