టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఛార్మీ నటిస్తున్న తాజా చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్ వర్క్లో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఛార్మీ ఈ నెల 17వ తేదిన రాబోయే తన పుట్టినరోజుని పురస్కరించుకుని తన అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు ఎవరైనా తనని పొగుడుతూ 30 సెకన్ల వీడియో తీసి యుట్యూబ్లో అప్లోడ్ చేయాలట. అయితే ఈ వీడియో తానూ ప్రస్తుతం నటిస్తున్న 'జ్యోతిలక్ష్మి' సినిమా ప్రమోషన్కు సంబంధించి ఉండాలనే కండీషన్ పెట్టింది. ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు అన్నీ చూసి అందులో తనకి బాగా నచ్చిన వీడియో తీసిన వీరాభిమానిని ఎంపిక చేసి అతన్ని తన పుట్టినరోజు నాడు వ్యక్తిగతంగా కలుస్తాను అని చెబుతున్నది ఛార్మి.
ఇప్పటికే తన జ్యోతిలక్ష్మి స్టిల్స్ ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఛార్మి రాబోయే తన పుట్టినరోజును కూడా తన జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్కు వాడుకుంటూ తన అభిమానులలో జోష్ పెంచేందుకు ఎత్తులు వేస్తుంది. మరి ఛార్మి మంతం పారుతుందో లేదో వేచి చూడాలి.