పవన్ కల్యాణ్ హీరోగా నటించే గబ్బర్ సింగ్ -2లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించనుంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్', 'లౌక్యం' చిత్రాలు హిట్టవడంతో హీరోయిన్గా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా, రకుల్ సింగ్కు బంపర్ ఆపర్ లభించింది.
పవన్ కల్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న 'గబ్బర్ సింగ్ -2'లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ను హీరోయిన్గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ సినిమాలో పవన్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ రకుల్ దక్కించుకోవచ్చని ఫిలింనగర్ సమాచారం. గబ్బర్ సింగ్ -2 రెగ్యులర్ షూటింగ్ నవంబర్లో ప్రారంభం కానుంది.