Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలీ... ప్లీజ్ అంజలి.. నన్ను కరుణించవా : దర్శకుడు కళంజియం వేడుకోలు!

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (10:21 IST)
టాలీవుడ్ బ్యూటీ అంజలిని తమిళ దర్శకుడు కళంజియం ప్రాధేయపడుతున్నాడు. తనపై కరుణ చూపాలంటూ కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఇదే అంజలిని నలుగురి ముందు నవ్వుల పాలుజేసేందుకు ఈ తమిళ దర్శకుడు కోర్టు మెట్లెక్కిన విషయం తెల్సిందే. ఇపుడే ఇదే కళంజియం నటి అంజలి కరుణాకటాక్షాల కోసం ఎదురుచూస్తుండటం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో ఓ లుక్కేద్ధాం. 
 
ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళంజియం ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన కారు పంక్చరు కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, కళంజియం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గతంలో అంజలికి ఓ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. 
 
ఇలాంటప్పుడు అంజలి తన డబ్బులు వాపస్ చేస్తే బాగుండునని కోరుకుంటున్నాడు. అయితే ఈ డబ్బుపై కళంజియం ఇంతకుముందు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అంజలిపై పరువు నష్టం పిటిషన్ కూడా వేశాడు. తమిళ నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయకూడదని సినీ అసోసియేషన్ ముందు పంచాయతీ పెట్టాడు. సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకుని ప్లేటు ఫిరాయించిందంటూ కళంజియం కోర్టు తలుపు తట్టాడు. 
 
ఆ తరువాత ఆమె పిన్ని పెట్టిన మిస్సింగ్ కేసులో కూడా కళంజియం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. అతని వేధింపులు తాళలేకే అంజలి దాక్కుందన్న వార్తలు కూడా విదితమే. ఇప్పుడు అదే దర్శకుడు దయనీయస్థితిలో ఆమెను వేడుకుంటున్నాడు. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఇదేనేమో..! 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments