Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్-అక్షర మూవీకి అడిషనల్ క్రేజ్.. 9 మంది..?

Webdunia
సోమవారం, 25 ఆగస్టు 2014 (15:45 IST)
ధనుష్ బాలీవుడ్ సినిమాకు అడిషనల్ క్రేజ్ దక్కనుంది. బక్కగా ఉన్నా చూడడానికి పర్వాలేదనిపించుకున్నా.. రంఝానాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. రంఝానా హిట్ కావడంతో బాలీవుడ్‌లో ధనుష్ రెండో సినిమా చేస్తున్నాడు. 
 
రంఝానాలో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్‌తో చేశాడు. ప్రస్తుతం ధనుష్ నటించే రెండో బాలీవుడ్ మూవీ షామితాబ్‌లో కమల్ రెండో కుమార్తె అక్షరతో ధనుష్ జోడీ కట్టనున్నాడు. 3 సినిమా ద్వారా కమల్ పెద్ద కూతురు గబ్బర్ సింగ్ హీరోయిన్‌ శృతిహాసన్‌తో జతకట్టిన బక్క పలచని ధనుష్‌కు దశ తిరిగిందంటున్నారు. 
 
అందుకే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ధనుష్ హీరోగా ఆర్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేగాకుండా ఈ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించేందుకు 9 సెలబ్రిటీలు కూడా ఓకే చెప్పేశారట. 9 మంది సెలబ్రిటీలలో కరణ్ జోహార్, మహేష్ భట్, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, అనురాగ్ బసు, జావేద్ అక్తర్‌లు కూడా ఉన్నారు. 
 
ఇకపోతే.. ధనుష్-బాల్కీ కాంబినేషన్‌లో వస్తోన్న షామితాబ్ మూవీకి తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చడం విశేషం. ఈ సినిమా 2015 ఫిబ్రవరి ఆరోతేదీన రిలీజ్ కానుంది.  

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments