రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం మొదటి పార్ట్ పూర్తయింది. మహాబలేశ్వరంలో షూటింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో సెంటిమెంట్గా ముగింపు పలికాడు. ఇంతటితో పార్ట్-1 పూర్తయిందని తెలిసింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది చేయనున్నారు.
ఈలోగా రానాను డి.సురేష్ బాబు తన స్వంత బేనర్లో చిత్రం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనంతో కూడిన ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు.