Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ సుమ మామ స్థలం కబ్జా : పోలీసులకు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (14:44 IST)
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో దౌర్జన్యపు భూఆక్రమణలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రాజీవ్ కనకాల తండ్రి, సీనియర్ నటుడు అయిన దేవదాస్ కనకాలకు చెందిన భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దేవదాస్ కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి కొందరు దుండగులు ప్రవేశించి, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న దేవదాస్ తదితరులు దుండగులను వెళ్లిపొమ్మని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో, పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments