'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో' అనే విధంగా అందాల భామ ఆదాశర్మ నడుచుకుంటోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమ్మడు మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో సాయిధరమ్ తేజ పక్కన నటించడానికి కూడా అంగీకరించిందట. అయితే హీరోయిన్గా కాదట.
హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ హీరోగా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆదాశర్మ గెస్ట్ పాత్రకు తీసుకున్నారు. ఇది చిన్న పాత్రే అయినప్పటికీ, ప్రాధాన్యం వున్న పాత్ర అనీ, ఆ క్యారెక్టర్ గురించి వివరించగానే వెంటనే ఒప్పుకుందనీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే నెపంతోనే ఆమె ఈ గెస్ట్ పాత్రకు అంగీకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన హీరోయిన్గా రెజీనా నటిస్తోంది.