Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజుల్లో 'రచ్చ' చేసిన వసూళ్లు అక్షరాల రూ. 15 కోట్లు

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2012 (14:40 IST)
WD
చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ నటించిన 'రచ్చ' సినిమా ఈ నెల 5న విడుదలైంది. విడుదలైన 3 రోజుల్లోనే రూ. 15 కోట్ల షేర్‌ వచ్చిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీప్రసాద్‌ తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మెగా సూపర్‌గుడ్‌ బేనర్‌లో ఎన్నో సినిమాలు తీశాం. ఇంత పెద్ద చిత్రం చేయడం ఇదే మొదటిసారి. మా బేనర్‌లో ఇంతవరకు రాని కలెక్షన్లు ఈ సినిమాతో వచ్చాయి. ఈ విజయం చిరంజీవి అభిమానుల విజయమని చెప్పారు.

రామ్‌ చరణ్‌, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు సంపత్‌నంది దర్శకుడు. ఏమైంది ఈ వేళ- సినిమా చేశాక రామ్‌ చరణ్‌ సినిమాకు ఆఫర్‌ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంపత్ అన్నారు. ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పాను. ఆయన మొదటి నుంచి ఎంతో సహకరించారు. ఆయన అంగీకరించకపోతే ఈ సినిమానే లేదని దర్శకుడు సంపత్‌నంది చెప్పారు.

సంపత్ మాట్లాడుతూ... నేను ఏదో పెద్ద కళాఖండం తీయలేదు. కమర్షియల్‌ సినిమా తీశానని చెప్పగలను. మొదట్లో ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో టాపిక్‌లు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు కూడా కామెంట్లు వచ్చాయి. రిలీజ్‌ తర్వాత రచ్చ సత్తా ఏమిటో చూపించింది. అద్భుతమైన హిట్‌ ఇచ్చారు ప్రేక్షకులు అని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments