దర్శకుడు సుకుమార్ తాజాగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో ఎమ్మెస్రాజు తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తారు. ఈ సినిమా ద్వారా తొలి ప్రయత్నంగా తన అసోసియేట్ వేమారెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
' అంతకుముందు ఆ తర్వాత' చిత్రంలో సుమంత్ అశ్విన్ నటన నన్ను ఎంతగానో ఆకట్టుకొంది. మా సినిమాకు ఆయన సరిగ్గా సరిపోతాడని ఎంపిక చేసుకున్నాం. ప్రస్తుతం నేను 1 సినిమా పనుల్లో ఉన్నాను దీనితర్వాత వేమారెడ్డి సినిమాను నిర్మిస్తానని సుకుమార్ చెప్పారు.