అనుష్క అరంధతి సినిమాలో నటించిన తర్వాత ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఐతే ఇటీవల విడుదలయిన సింగం 2లో అనుష్క ముఖం పీక్కుపోయి బుగ్గలు తోసుకుపోయి కనిపించిందని ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారట. ఆమె అందం అలా అవడం వెనుక కారణం ఎవరయా అని వాళ్లు ఆరా తీస్తే... వారి దృష్టిలోకి ఇద్దరు వచ్చారట.
ఆ ఇద్దరు ఎవరయా అని అడిగితే... ఒకరు ఎస్ఎస్ రాజమౌళి కాగా ఇంకొకరు గుణశేఖర్ అని చెపుతున్నారు. ఇంతకీ వాళ్లిద్దరి వల్ల అనుష్క అందం ఛార్మింగ్ లేకుండా ఎలాపోయిందీ అనంటే, కొన్ని వివరాలు బయటకు వచ్చాయట. అవేంటంటే, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న బాహుబలి చిత్రం కోసం అనుష్కకు డెయిలీ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విద్యలు నేర్పిస్తున్నాడట.
ఈ విద్యల కోసం అనుష్క తన అందాన్ని కాపాడుకునేందుకు చేసే యోగాను పక్కన పెట్టేసి పూర్తిగా వాటిపైనే స్వారీ చేస్తోందట. దీంతో శరీరంలో కొవ్వంతా కరిగిపోతూ బుగ్గలు పీక్కుపోయి, ముఖం వాడిపోతోందట. రాజమౌళి సినిమా ఒక్కటే కదా అనుకుంటే ఇంకోవైపు నుంచి గుణశేఖర్ కూడా మొదలెట్టాడట.
రుద్రమదేవి సినిమా కోసం అనుష్కతో రోజూ ఫీట్లపై ఫీట్లు చేయిస్తున్నాడట. ఈ ఇద్దరు డైరెక్టర్ల ట్రెయినింగుతో అనుష్కలో ఉన్న ఛార్మింగ్ కాస్తా ఆరిపోతోందట. మరి ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి అనుష్క అందాలు ఏ స్థాయిలో కనబడతాయో చూడాల్సిందే.