" అమ్మచెప్పింది", "గమ్యం" ఫేం హీరో శర్వానంద్కు చెందిన "బీన్జ్-ది అర్బన్ కాఫీ విలేజ్"ను హీరో విక్టరీ వెంకటేష్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.15 రామాలయం టెంపుల్ ఎదురుగాగల ఈ హోటల్ను వెంకీ ప్రారంభించారు.
ఈ హోటల్ ప్రారంభోత్సవంలో నటులు ఆర్యన్ రాజేష్, మంచు విష్ణువర్ధన్ బాబు, లక్ష్మీప్రసన్న, రామ్, భరత్, అర్జన, నిర్మాచ గుణ్ణం గంగరాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ... ఎప్పటి నుంచో మంచి కాఫీ షాప్ నెలకొల్పాలని ఆలోచన ఉండేదన్నారు. ఇప్పుడన్నీ అధునాతనమైనవేనని, కానీ విలేజ్ వాతావరణంలో ఆహ్లాదకరంగా వుండే విధంగా నెలకొల్పాలని చేసిన ప్రయత్నమిదన్నారు.
త్వరలో గచ్చిబౌలీలోనూ కాఫీ విలేజ్ నెలకొల్పనున్నామని, ఆ తర్వాత వైజాగ్, చెన్నై, బెంగళూరులలో ప్రారంభించనున్నట్లు శర్వానంద్ పేర్కొన్నారు.