' డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ మిలియనీర్ ఇండియాకి వచ్చి ఏం సాధించాడనే తెరపైనే చూడాలంటున్నారు దర్శకుడు గోపి చంద్ మలినేని. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పండగ చేస్కో'. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఎ యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పకులు. శనివారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. వి.వి.వినాయక్ క్లాప్నిచ్చారు. దిల్ రాజు కెమెరా స్విఛ్చాన్ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ... బలుపు చిత్రం తరువాత చేస్తున్న చిత్రమిది. మంచి కథ కోసం ఇంతకాలం వెయిట్ చేశాము. వెలిగొండ శ్రీను చక్కని కథనిచ్చారు. కథకు తగ్గ టీమ్ కుదిరింది. కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనరిది. రామ్ ఎనర్టీకి ఈ కథ 100 శాతం యాప్ట్ అవుతుంది. రకుల్ పాత్ర కూడా ఎనర్జిటిక్గా ఉంటుంది. జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరో. హీరోయిన్, బ్రహ్మానందం మధ్య గల సన్నివేశాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. రామ్ 'పండగ చేస్కో'నేలా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.
చిత్ర సమర్పకులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ... ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా తీయడం అవసరమా అని చాలామంది హెచ్చరించారు. ఈ కథ విన్నప్పటి నుండి ఎప్పుడు చేద్దామా అని యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాను. అంత పవర్ ఉన్న కథ ఇది. అసలు ఈ సినిమాని మార్చిలోనే ప్రారంభించాలి. కథ మీద డీప్గా వర్క్ చేసి ఇప్పుడు ప్రారంభించాం. కథ ఎంపిక కరెక్ట్గా లేకపోతే ఫలితం ఎలా ఉంటుందనేది నా గత చిత్రాలు తెలిపాయి. అందుకే ఈ కథ మీద టీమంత కష్టపడి వర్క్ చేశారు. మూడేళ్ళగా రామ్తో, గోపితో సినిమా చేయాలన్న ఆశ ఇప్పటికి నెరవేరుతుంది అని అన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ... మసాలా సినిమా కన్నా ముందే వెలిగొండ శ్రీను ఈ కథ చెప్పారు. చాలా ఇంప్రెసీవ్గా అనిపించింది. కథ రాసి ఈ తరువాత టీమ్ని సెట్ చేయడమంటే నాకిష్టం. అదే ఈ సినిమాకు జరిగింది. మంచి కథకి చక్కని టీమ్ కుదిరింది. తమన్ కెరియర్ బెస్ట్ మ్యూజిక్ ఇస్తానన్నాడు అని తెలిపారు. రామ్, గోపితో చేస్తున్న మూడో చిత్రమిది. డెఫినెట్గా హ్యాట్రిక్ అవుతుంది అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ఎనర్జిటిక్ హీరో రామ్తో పనిచేయడం ఆనందంగా ఉంది. తమన్ మ్యూజిక అంటే ఇష్టం అని కథానాయిక రకుల్ తెలిపారు.