Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌ చరణ్‌, శ్రీను వైట్ల భారీ చిత్రం... ఆగష్టులో షూటింగ్!

Webdunia
గురువారం, 10 ఏప్రియల్ 2014 (09:14 IST)
FILE
ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ తదుపరి సినిమా ఖరారైంది. ఎంటర్ టైన్మెంటుకి అధిక ప్రాధాన్యత ఇచ్చే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. చరణ్ నటించిన 'నాయక్‌' చిత్రాన్ని అందించిన యూనివర్సల్‌ మీడియా అధినేత డివివి దానయ్య దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. ప్రముఖ తారాగణంతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.

ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీను వైట్ల అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. నాయక్‌, ఎవడు తర్వాత రామ్‌ చరణ్‌ ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌పై కన్నేశాడు. వీరిద్దరి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నిర్మాత. దూకుడు చిత్రం టాప్ లేపేసే యాక్షన్ అండ్ కామెడీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని అంటున్నారు.

మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత పవన్‌ కళ్యాణ్‌తో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి వంటి చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Three Capitals: 2029 తర్వాత తాడేపల్లి నుంచే జగన్ కార్యకలపాలు- సజ్జల మాటల అర్థం ఏంటి?

India First AI Village: భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం ఎక్కడుందో తెలుసా?

86 శాతం పనులు పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్-రామ్మోహన్ నాయుడు

Amaravati: అమరావతిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవోటెల్ హోటల్

శ్మశానవాటిక లోపల ఓ మహిళ సెక్స్ రాకెట్ నడిపింది.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

Show comments