Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌ చరణ్‌, శ్రీను వైట్ల భారీ చిత్రం... ఆగష్టులో షూటింగ్!

Webdunia
గురువారం, 10 ఏప్రియల్ 2014 (09:14 IST)
FILE
ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ తదుపరి సినిమా ఖరారైంది. ఎంటర్ టైన్మెంటుకి అధిక ప్రాధాన్యత ఇచ్చే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. చరణ్ నటించిన 'నాయక్‌' చిత్రాన్ని అందించిన యూనివర్సల్‌ మీడియా అధినేత డివివి దానయ్య దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. ప్రముఖ తారాగణంతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.

ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీను వైట్ల అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. నాయక్‌, ఎవడు తర్వాత రామ్‌ చరణ్‌ ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌పై కన్నేశాడు. వీరిద్దరి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నిర్మాత. దూకుడు చిత్రం టాప్ లేపేసే యాక్షన్ అండ్ కామెడీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని అంటున్నారు.

మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత పవన్‌ కళ్యాణ్‌తో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి వంటి చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments