గత నెల 31వ తేదీ మెగా కుటుంబం చాలా బిజీగా ఉంది. 30వ తేదీన అల్లు శిరీష్ హీరోగా చిత్రం ప్రారంభమైంది. 31న రామ్ చరణ్ చిత్రం ప్రారంభం. అదేరోజు అల్లు అర్జున్ నటించిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా ఇండస్ట్రీలో డివైడ్ టాక్ ఉంది. అయితే బయటమాత్రం నెగెటివ్ టాక్ ఉంది.
కానీ ఈ రెండు చిత్రాల్లో కామన్ పర్సన్ నిర్మాత బండ్ల గణేష్.. ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని రామ్ చరణ్తో చేస్తున్నానని అన్నాడు. అంతకుముందే పవన్ కళ్యాణ్తో గబ్బర్సింగ్ సినిమా తీసి ఆ ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యాడు.
31 వ తేదీన రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా జిమ్ బిజినెస్కు సంబంధించిన ఒప్పందాన్ని ఓ ప్రముఖ సంస్థతో కుదుర్చుకుంది. మే నెలాఖరున మెగా ఫ్యామిలీ బిజీగా ఉందన్నమాట.