మహేష్ బాబు చేతుల మీదుగా విజయవాడలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపబోతున్నట్లు సమాచారం. అదలావుంచితే రాజకీయ కేంద్రంగా పేరుపొందిన విజయవాడలో మహేష్ బాబు హల్చల్ చేయనున్నాడు. తన అభిమానుల్ని సరదాగా కలవనున్నాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ నెల 16న అంటే సంక్రాంతి సందర్భంగా విజయవాడలో జోస్ఆలుకాస్ అనే కొత్త భవనాన్ని ప్రారంభించనున్నాడు. దానికి ఆయన యాడ్ ప్రమోటర్గా ఉన్నాడు. పనిలోపనిగా అదేరోజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్లాటినం డిస్క్ కూడా జరిపే ఆలోచనలో నిర్మాత దిల్రాజు ఉన్నాడు.
ఈ రెండు కార్యక్రమాలు చేయడంతో మహేష్ బాబు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుజాగ్రత్తచర్యగా పోలీసు బందోబస్తుకు పర్మిషన్ తీసుకున్నారు.