యంగ్టైగర్ ఎన్టీఆర్, సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అగ్రనిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బాద్షా'. ఈ చిత్రం ట్రైలర్ మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ - ''మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నాం. అలాగే మార్చి17న ఈ చిత్రం ఆడియో చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. మార్చి 17న ఎన్టీఆర్, శ్రీను వైట్ల, నేను స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామిని, సింహాచలంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకొని సాయంత్రం అభిమానుల మధ్య హైదరాబాద్ నానక్రామ్గూడలోని రామానాయుడు సినీవిలేజ్లో జరిగే మా 'బాద్షా' ఆడియో ఫంక్షన్లో పాల్గొంటాము. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నార. ఇది ఎన్టీఆర్ కెరీర్లో ఒక రేర్ స్పెషల్ పీస్ అవుతుంది. లిమిటెడ్ ఎడిషన్ అన్నట్టుగా శ్రీను వైట్ల ఎన్టీఆర్తో ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం చేస్తున్న స్పెషల్ పీస్ ఈ సినిమా'' అన్నారు.
ఎన్టీఆర్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 50 మంది ప్రముఖ నటీనటులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్., కె.వి.గుహన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు సాంకేతికవర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.