కృష్ణుడు హీరోగా మాస్టర్ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్ బేనర్పై రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' పాటలు మినహా టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్ర యూనిట్ మే 11న బ్యాంకాక్ వెళ్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.సురేష్బాబు మాట్లాడుతూ - ''సక్సెస్ఫుల్గా టాకీ కంప్లీట్ చేశాం. మేం ముందుగా అనుకున్న రోజుల్లోనే షూటింగ్ పూర్తయింది. చిత్రంలోని ఐదు పాటల్లో ఒక పాటను ఐటమ్ సాంగ్గా చిత్రీకరించాం. మిగిలిన పాటలను హీరో, హీరోయిన్లపై చిత్రీకరించేందుకు మే 11న బ్యాంకాక్ వెళ్తున్నాం.
అక్కడ అందమైన లొకేషన్స్ ఈ పాటల చిత్రీకరణ చెయ్యబోతున్నాం. ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ రాధాకృష్ణన్ మ్యూజిక్. తప్పకుండా ఈ ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది. మే 27న ఈ ఆడియో రిలీజ్ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.