ఇప్పటి నిర్మాతల్లో అందరికన్నా.. ఎక్కువ చిత్రాలు నిర్మిస్తూ.. ఇండస్ట్రీ ఆ నలుగురిలో ఒక్కడిగా ఉన్న తెలంగాణా నిర్మాత దిల్రాజు. డిస్ట్రిబ్యూటర్గా హిట్ చిత్రాలను చేసిన ఆయన ఇప్పుడు అదే జోరులో సినిమాలు చేస్తున్నాడు.
ఎక్కువగా పెద్ద హీరోలతో చేయడం విశేషం. గతంలో అశ్వనీదత్ అంత దూకుడుగా ఉండేవారు. రామ్చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా చేయాలని వంశీపైడిపల్లికి చెబితే.. ఆయన రాసుకున్న కథతో 'ఎవడు' చిత్రం వచ్చింది.
మరోవైపు ఎన్.టి.ఆర్.తో వస్తావయ్యా రామయ్యా! అంటు రాబోతున్నాడు. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అశోక్, ఊసరవెల్లి చిత్రాలు ఫ్లాప్ చిత్రాలు అయితే ఆ చిత్రాలకు కథ ఇచ్చిన వక్కంతం వంశీకి డైరెక్టర్గా అవకాశం ఇస్తున్నాడు దిల్రాజు.
అది కూడా ఎన్.టి.ఆర్.తో చేయబోతున్నట్లు తెలిసింది. గతంలో వక్కంతంవంశీ ఓ చిత్రం చేసి నిర్మాతకు చేతులు కాల్చాడు. మళ్ళీ ఆ ప్రయత్నం చేయనని ఇటీవలే ఓ సభలో వ్యాఖ్యానించారు.
కానీ ఆ మాటను మార్చుకున్నట్లు కన్పిస్తుంది. దిల్రాజు వంటి నిర్మాతే ముందుకువస్తే... చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.