యువ హీరో రామ్ చరణ్ తేజ్, తెల్లపిల్ల తమన్నా జంటగా నటిస్తున్న 'రచ్చ' యూనిట్ త్వరలో చైనా వెళ్లనుంది. భారీ బడ్జెట్తో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఎన్వీ ప్రసాద్, పారాస్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ను ఈనెల 12వ తేదీ నుంచి చైనాలో నిర్మించనున్నారు.
దీనిపై చిత్ర దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను చైనాలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. చైనాలోని ఓ అటవీ ప్రాంతంలో ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు శ్రీలంక, బ్యాంకాక్లో కొన్ని పోరాట దృశ్యాలు చిత్రీకరించారు.
పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమాలో చెర్రీ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను కనిపించనున్నాడు. చెర్రీ హీరోగా గతంలో వచ్చిన 'ఆరెంజ్' చిత్రం నిరాశపరచటంతో రచ్చతో మంచి హిట్ ఇవ్వాలని రామ్ చరణ్ గట్టిపట్టుదలతో ఉన్నారు.