బాలీవుడ్లో రొమాంటిక్ ప్రేమ జంటగా పేరుతెచ్చుకున్న కత్రినా-రణబీర్లు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. మేమిద్దరం ప్రేమించుకోవట్లేదు. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చిలుకపలుకులు పలికే కత్రినా తన ప్రియుడితో మరోసారి మీడియాకు దొరికిపోయింది. గతంలో రణబీర్తో విదేశీ పర్యటనలో బీచ్లో ఫోటోలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా కత్రినా-రణబీర్లు 'ధూమ్-3' సినిమాకు వెళ్లి థియేటర్లో అడ్డంగా బుక్కయ్యారట. ఈ జంట 'ధూమ్-3' సినిమా చూస్తుండగా... థియేటర్లో ప్రేక్షకుల కంటపడ్డారట. ఇంకేముంది.. అంతపెద్ద స్టార్స్ ఒక్కసారి కనిపిస్తే ఏమైనా ఉందా? ఆటోగ్రాఫ్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంలో మీడియా వారు కూడా అక్కడ కనిపించడంతో ఇక్కడ ఉండటం మంచిది కాదని ఈ జంట మెల్లగా అక్కడి నుంచి జారుకుందట. ఈ థియేటర్ ఉదంతంతో వీరిపై వినిపిస్తున్న ప్రేమ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది.