Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2013 (17:37 IST)
WD
చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంవల్లే ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా ఎవరూ అండగా లేని పరిస్థితి వచ్చింది.

ఇటీవల కులశేఖర్ అక్టోబ‌రు 24న కాకినాడ‌లోని ఓ గుడికి వెళ్లి.. అక్కడ ద‌ర్శనానంత‌రం దేవుడి శ‌ఠ‌గోపం ఎత్తుకొచ్చార‌నే ఆరోప‌ణ‌ల‌పై కుల‌శేఖ‌ర్‌‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తీర్పు కూడా వ‌చ్చింది. కుల‌శేఖ‌ర్‌‌కి ఆరు నెల‌ల జైలు శిక్ష కూడా విధించారు. గీత ర‌చ‌యిత‌గా బిజీ అయిన‌ప్పుడే.. ఆయ‌న 'ప్రేమ‌లేఖ‌రాశా' అనే చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు.

ఆ సినిమా చాలాకాలం పాటు విడుద‌ల‌కు నోచుకోలేదు. అప్పుడే కుల‌శేఖ‌ర్ మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యారు. దీంతో ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ దొంగతనం కేసులో ఆయన తరుఫున ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే ఓ న్యాయవాధిని నియమించి కేసును విచారించాలని ఆదేశించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments