దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు'. వంశీ పైడిపల్లి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రారంభంలోనే అల్లు అర్జున్ గెస్ట్రోల్ చేస్తున్నాడని రామ్చరణ్ చెబితే... అదేమీ లేదని నవ్వుతూ సెలవిచ్చాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేంగా జరుపుకుంటోంది.
ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాలలో సెట్వేసి ఐటంసాంగ్ను చిత్రీకరిస్తున్నారు. అందులో ముమైత్ఖాన్ లేదంటే ఎవరైనా బాలీవుడ్ భామతోనే చేయాలా అనే డైలమాలో ఉన్నారు. రెండవ షెడ్యూల్ గత నెల 29న ప్రారంభమైంది. సమంతా, ఏమీజాక్సన్ హీరోయిన్లు.
ఇదిలా ఉండగా, ఇందులో అల్లు అర్జున్ నటించే సన్నివేశం మొన్ననే చిత్రీకరించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సీన్ వాయిదా పడింది. మరి ఆ సీన్ ఎప్పుడు జరుగుతుందోనని యూనిట్ ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.