థియేటర్లలో స్పందన చూసి తమ చిత్రం సక్సెస్గా భావిస్తున్నానని "అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్" దర్శకుడు హరి ఎల్లేటి అన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని "గమ్యం" దర్శకుడు రాధాకృష్ణ చూసి ప్రశంసించడం గొప్పగా భావిస్తున్నానని అన్నారు.
ఎంటర్టైన్మెంట్ చేసే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని హరి ఎల్లేటి తెలిపారు. ఒకరినొకరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే ఉత్తమమని, స్నేహానికి గల విలువలను తెలియజెప్పే చిత్రమిదని పేర్కొన్నారు. ఇంకా.. ఈ చిత్రంలో నటించిన నిఖిల్, వేణు, పింగ్పాంగ్, ప్రదీప్, నటి మేఘా బర్మన్లు కూడా చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.