Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిసేడు గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహారదీక్ష

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:43 IST)
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల మరోమారు నిరుద్యోగ నిరాహారదీక్షకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఆమె ఈ దీక్షను ప్రారంభించారు. 
 
ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
 
షబ్బీర్‌ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని ష‌ర్మిల‌ భరోసా ఇచ్చారు. అనంతరం ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష‌ సాయంత్రం 5 గంటల వరకు జ‌ర‌గ‌నుంది. 
 
తెలంగాణ‌లో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ష‌ర్మిల గతంలోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు ఈ దీక్షను పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments