డీకే అరుణను రాజకీయంగా పైకి తెచ్చిందే వైఎస్సారే.. గుర్తుందా?

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (16:57 IST)
'వైఎస్సార్ బిడ్డ తెలంగాణలో ఏం పని' అని డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తాను వైఎస్సార్ బిడ్డనని, తెలంగాణ గడ్డ మీదే పెరిగానని, ఇక్కడే చదువుకోవడంతో పాటు తన బిడ్డకు కూడా జన్మనిచ్చానని తెలిపారు.

తెలంగాణ కోసం వైఎస్సార్ కుటుంబం ఏం చేసిందని అరుణ అడుగుతున్నారని.. అసలు గద్వాల్ ప్రజల కోసం మీరేం చేశారో చెప్పాలని తిరిగి ప్రశ్నించారు. అసలు డీకే అరుణను రాజకీయంగా పైకి తెచ్చిందే వైఎస్సార్ అని షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ బిడ్డ తెలంగాణ రాజకీయాలకు రావడం అరుణకి నచ్చనట్టుందని సెటైర్ వేశారు.

డీకే అరుణ కాదు.. కేడీ అరుణ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నానని షర్మిల బదులిచ్చారు. డీకే అరుణ ఎప్పుడూ ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడింది లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments