Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలీనం వార్తలను ఖండించిన వైఎస్ షర్మిల.. నా ఆరాటం.. నా పోరాటం..

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (09:52 IST)
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారన్న కథనాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల సీరియస్‌గా స్పందించారు. కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే వార్తలు తెగ ప్రచారమవుతున్నాయి. 
 
దీనిపై షర్మిల స్పందిస్తూ.. ఊహాజనిత కథలు కల్పిస్తూ.. తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. విలీనం వార్తలను ఖండించారు. తన భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనేనని.. తన ఆరాటం, తన పోరాటం తెలంగాణ కోసమేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన రాజకీయ భవితపై పెట్టే సమయాన్నికేసీఆర్ పాలనపై పెట్టాలని సూచించారు. 
 
మరోవైపు షర్మిల ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు కూడా ఓ కారణమని తెలుస్తోంది. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లో ఉందని థాక్రే అన్నారు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎంతగానో కష్టపడుతున్నారని అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments