Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం వరకు ఏకాంతంగా గడిపారు.. ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:47 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, వారు చనిపోయేముందు గ్రామ శివార్లలో ఏకాంతంగా గడిపి, ఆ తర్వాత అక్కడే చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చివ్వెం మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తూవచ్చాడు. కొన్నినెలల ప్రేమాయణం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. 
 
దీంతో మనస్తాపానికి గురైన వారు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొద్దుల చెరువు గ్రామ శివారులో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. పిమ్మట ఓ చెట్టుకు ఉరేసుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఈ ప్రేమజంట మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments