Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో మూడు రోజుల్లో పెళ్లి... కరోనాతో ప్రభుత్వ టీచర్ మృతి..

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:18 IST)
కరోనా ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ప్రభుత్వ టీచర్ కరోనాబారిన పడి మృత్యువాతపడడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. 28 ఏళ్ల యువకుడు. ప్రభుత్వ స్కూల్లో టీచర్.

ఇంకేముంది జీవితంలో స్థిరపడ్డానన్న సంబరంలో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతా  అనుకున్నట్టుగానే జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత అంతా భావించినట్టుగానే పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. మే 2న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. 
 
కాని విధి వక్రీకరించింది.. కరోనా సెకండ్ వేవ్ అతని ఆశలపై నీళ్లజల్లింది. కరోనా కబలించింది. దీంతో వారం క్రితం పరీక్షలు చేయించుకున్న యువకుడు పాజిటీవ్ అని నిర్థారణ కావడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు విడిచాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలోని మాన్యానాయక్ తండాలో ఈ ఘటన జరిగింది. కర్ర గణపతి చౌహాన్ అనే యువకుడు మెదక్ జిల్లాలోని గడిపెద్దాపూర్ జడ్పీ హైస్కూల్‌లో.. అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా కరోనా కాటుకు బలయ్యాడు. అన్ని బాగుంటే మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్న గణపతి చౌహాన్ మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments