పెళ్లి చేసుకోమని ప్రియుడురాలు ఒత్తిడి.. భార్యకు తెలియడంతో....

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:57 IST)
ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి... మరో యువతి ప్రేమలో పడి పీకల్లోతులో కూరుకునిపోయాడు. అదేసమయంలో పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి ఒత్తిడి చేయసాగింది. పైగా, ఈ విషయం భార్యకూ తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక... బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్‌లో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రెయిన్‌ బజార్‌కు చెందిన దీపక్ కుమార్ (18) అనే యువకుడు హయత్‌ నగర్‌కు చెందిన యువతిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హయత్ నగర్‌లో ఉంటున్న అతడు ఇటీవల మరో యువతి ప్రేమలో నిండా మునిగాడు. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో మనస్పర్థలు చెలరేగాయి. మరోవైపు, పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని పలుమార్లు స్నేహితులకు చెప్పుకుని మథనపడ్డారు. 
 
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి కరణ్‌లాల్ వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. 
 
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments