Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో యువ డాక్టర్ పూర్ణ చందర్ గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (12:19 IST)
హైదరాబాద్ నగరంలో ఆస్ప‌త్రిలో విషాదం నెల‌కొంది. డాక్ట‌ర్ పూర్ణ చంద‌ర్(28) గుండెపోటుతో బుధ‌వారం ఉద‌యం చ‌నిపోయారు. బుధ‌వారం ఉద‌యం డాక్ట‌ర్ పూర్ణ చంద‌ర్ త‌న విధులు ముగించుకున్న అనంత‌రం గాంధీ ఆస్ప‌త్రిలోని నాలుగో అంత‌స్తు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా కుప్ప‌కూలిపోయాడు. 
 
అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను ఎమర్జెన్సీ వార్డుకు త‌ర‌లించారు. అయిన‌ప్ప‌టికీ అత‌ను వైద్యానికి స‌హ‌క‌రించ‌లేదు. గుండెపోటుతో పూర్ణ చంద‌ర్ మ‌ర‌ణించిన‌ట్లు సీనియ‌ర్ వైద్యులు నిర్ధారించారు.
 
డాక్ట‌ర్ పూర్ణ‌చంద‌ర్ జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో ఇటీవ‌లే సీనియ‌ర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పూర్ణ చంద‌ర్ గాంధీలో సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. అయితే డాక్ట‌ర్ పూర్ణ చంద‌ర్ మంగ‌ళ‌వారం స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తోటి జూనియ‌ర్ డాక్ట‌ర్లు చెప్పారు. 
 
ఛాతీలో నొప్పి వ‌స్తుంద‌ని, క‌డుపుంతా వికారంగా ఉన్న‌ట్లు పూర్ణ‌చంద‌ర్ తెలిపిన‌ట్లు జూడాలు పేర్కొన్నారు. అందుకోసం మెడిసిన్స్ వేసుకున్నాడ‌ని, బుధ‌వారం మ‌ళ్లీ విధుల్లో చేరార‌ని జూడాలు స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments