Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి చేసుని కాపురం పెట్టిన భర్త.. దేహశుద్ధి చేసిన తొలి భార్య

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:48 IST)
తొలి భార్య ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొని కాపురం పట్టిన భర్తను పట్టుకొని దేహశుద్ధి చేసింది మొదటి భార్య.. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా ముఠాకొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. పరశురాంకి, ధనలక్ష్మీతో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే వ్యాపరం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరుశురాం.. మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీనితో అనుమానం వచ్చి ఆరా తీయగా.. కామారెడ్డికి చెందిన కవిత అనే ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. 
 
దీనితో ధనలక్ష్మి సోమవారం బంధువులతో కలిసి వచ్చి భర్తను చితకబాదింది. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని పరుశురాం రెండో భార్య కవిత ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments