Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్ అడిగితే రైల్వే మహిళా టీసీని చిత్తుగా కొట్టారు!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (09:23 IST)
హైదరాబాద్‌, బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా రైల్వే టీసీపై ఎనిమిది మంది దుండగులు దాడి చేశారు. ఇంతకీ ఈ మహిళా టీసీ చేసిన నేరం.. వారిని టిక్కెట్ అడగడమే. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. 
 
బేగంపేట ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌లో టి కౌసల్య అనే మహిళా టీసీ తన విధులను నిర్వహిస్తుంది. ఆ సమయంలో పలువురు యువకులను టిక్కెట్లు చూపించమని అడిగింది. అంతే ఒక్కసారి ఎనిమిది మంది దండగులు ఆమెను చితకబాది, అక్కడ నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 
 
నిజానికి ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్ళలో టీసీలపై దాడులు ఎక్కువయ్యాయి. మొన్నటికిమొన్న ఓ మహిళా టీసీని రైల్లోంచి కిందికినెట్టివేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా, గురువారం ఓ ఎంఎంటీఎస్ రైలులో టికెట్ అడిగిన టీసీ కౌసల్యపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. దీనిపై బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments