Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్‌లో కేసులో తీర్పు జాప్యం : హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:31 IST)
హైదరాబాద్ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెండింగ్‌లో ఉన్న ఓ కేసులో తుది తీర్పు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని భరించలేని ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రయత్నించింది. ఈమె హైకోర్టు భవనంలోని మొదటి అంతస్థు నుంచి కిందకి దూకేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోదావరి ఖనికి చెందిన కవిత అనే మహిళకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో ఉంది. ఈ కేసు చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉండటం... రోజులు గడుస్తున్నా తీర్పు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. 
 
దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. కవితను అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి సిబ్బంది... సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈ యేడాది ఏప్రిల్ 11వ తేదీన మురళీ అనే వ్యక్తి హత్యాచారం చేశాడని విచారణలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments